Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : లష్కరేతోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ నిర్హహిస్తున్న ాజమాత్ ఉద్ దావ్ణా తీవ్రవాద సంస్థ కాదని బుధవారం పాకిస్తాన్ ప్రకటించింది. 2008లో ముంబయిలో మారణహౌమాన్ని సృష్టించిన పేలుళ్ల సూత్రధారైన హఫీజ్ స్వయంగా నడిపిస్తున్న దీనిని సేవా సంస్థని హౌంశాఖ సహాయ మంత్రి ఖాదిర్ బాలూచ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. లష్కరేతోయిబా పేరు మార్చుకొని జమాత్ ఉద్ దావాగా ఆవిర్భవించిందని ఐక్యరాజ్యసమితి భత్రతామండలి ప్రకటించటంపై ఆయన స్పందించారు. జమాత్ ఉద్ దావాకు లష్కరేతోయిబాతో సంబంధాలు ఉన్నట్లు ఏలాంటి ఆధారాలు లేవవి ఆయన చెప్పటం గమానార్హం. పైగా ఈ సంస్థ సేవా కార్యక్రమాలను చేస్తోందని ఆస్పత్రులు, స్కూళ్లు, అంబులెన్సుల సర్వీసులతోపాటు మతపరమైన సంస్థలను నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.
పాకిస్తాన్లో దీనిపై ఎటువంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. జామాత్ ఉద్ దావాని 2008-10ల మధ్య కాలంలో మూసివేశారన్నారు. కానీ లాహౌర్ హైకోర్ట్ అనుమతితో కార్యకలాపాలు కొనసాగిస్తోందని తెలిపారు. జైషే మహ్మమ్మద్ అనే తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే కారణంగా కుద్ధుమ్ ఉల్ ఇస్లామ్, జమాత్ ఉల్ ఫర్కాన్ సంస్థల కార్యకాలాపాలను నిషేధించామని ఖాదిర్ ప్రకటించారు.
జమాత్ ఉద్ దావాని ఐక్యరాజ్యసమితి తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. ప్రమాదకర ఉగ్రవాదుల జాబితాలోవున్న దీని అధినేత హహీజ్ సయ్యద్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే.