Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహెల్ సిసి
కైరో : ఉగ్ర దాడులను నిర్మూలించే విధానాలను భారత్ నుంచే నేర్చుకోవాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహెల్ సిసి వ్యాఖ్యానించారు. భారత్ అనుసరిస్తున్న విధానాలను నేర్చుకునేందుకు తానెంతో ఆసక్తిని చూపుతానన్నారు. ఉగ్రవాద బెదిరింపులకు తలొగ్గకుండా భారత్ గతంలో తీసుకున్న నిర్ణయాలు అద్వితీయమని ఆయన కితాబిచ్చారు. ఈ ఏడాది అక్టోబర్లో మూడో ఇండో -ఆఫ్రికా ఫోరం సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఆహ్వానించేందుకు ప్రధాని కార్యాలయ ప్రత్యేక రాయబారి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం ఈజిప్టు అధ్యక్షుడిని కలిశారు.