Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని మోడీ
- వివిధ దేశాధినేతలతో భేటీలు
ఉఫా(రష్యా) : రష్యాలోని ఉఫా వేదికగా జరుగుతున్న 7వ బ్రిక్స్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సమా వేశాలకు ఐదు దేశాల ప్రభుత్వాధినేతలు.. భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రూజెఫ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. బ్రిక్స్ దేశాలు పరస్పర సహాయ సహకారాలను అందించుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు సభ్య దేశాలు ఐకమత్యాన్ని కనబర్చాలన్నారు. ప్రపంచ జనాభాలో 44 శాతం ప్రజలు బ్రిక్స్ దేశాల్లోనే జీవిస్తున్నారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 40 శాతం జిడిపిని కలిగి ఉన్నాయని గుర్తు చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు అందరికీ సవాల్ విసురుతున్నాయని, వాటిని ఎదుర్కో వడంలో బ్రిక్స్ దేశాల పాత్ర కీలకమైం దన్నారు. వాణిజ్యం, రైల్వే, డిజిటల్, వ్యవసాయం, పట్టణీకరణలో సహాయ సహకారాలు అందించుకోవాలని సూచించారు. పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండాగా ముందుకు సాగా లన్నారు. వాతావరణంలో అసమాన మార్పులు అంతర్జాతీయ సవాళ్లుగా పరిణమిం చాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాలు వ్యవసాయ ఉత్పత్తుల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, ఈ సమావేశాల్లో ఆర్థిక ప్రగతి, పరస్పర సహకారం, నూతన అభివృద్ధి బ్యాంకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలన, దేశాల మధ్య విద్యుత్ రంగాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి.
దేశాధినేతలతో మోడీ బిజీబిజీ:
గురువారం మోడీ వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమై రక్షణ, పౌర అణుశక్తి రంగాల్లో సహకారాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. భారత్లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో రష్యా పెట్టుబడుల విషయమై చర్చించారు. అనంతరం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ అంశంలో పాక్పై చర్యకు చైనా తీసుకున్న నిర్ణయం, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్-చైనా ఎకనామిక్ కారిడార్ అంశంపై చర్చించారు. సంవత్సరం వ్యవధిలో ఐదు సార్లు కలుసుకోవడం మన మధ్య అనుబంధాన్ని చాటుతుందని మోడీ వ్యాఖ్యానించినట్లు వికాస్ స్వరూప్ తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడితోనూ భేటీ అయిన ప్రధాని ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
యోగా చేయడానికి ప్రయత్నిస్తా: పుతిన్
తాను కూడా యోగా చేయడానికి ప్రయత్నిస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ మోడీకి హామీ ఇచ్చారు. ఐరాసలో యోగా తీర్మానానికి మద్దతిచ్చినందుకు, యోగా దినోత్సవాన్ని నిర్వహించినందుకు ప్రధాని రష్యా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు.