Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా కోర్టు తీర్పు
న్యూయార్క్: తమ దేశంలోని పన్ను చెల్లింపుదారులను మోసం చేసినందుకు సాహిల్ పటేల్(36) అనే భారతీయుడికి అమెరికా కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పన్ను చెల్లింపుదారులపై బెదిరింపు, వైర్ ఫ్రాడ్ నేరాలకు పాల్సడినందుకు మ్యాన్హట్టన్ జిల్లా కోర్టు సాహిల్ పటేల్కు శిక్ష ఖరారు చేసింది. ట్యాక్స్ ఏజెంట్లుగా చెప్పుకొని పన్ను చెల్లింపుదారులకు ఫోన్లు చేసి బెదిరించడం ద్వారా 20 మిలియన్ కోట్ల డాలర్లను అక్రమంగా వసూలు చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. 3,967మంది బాధితుల నుంచి ఈ మొత్తాన్ని ఏజెంట్ల ముఠా రాబట్టినట్టు కోర్టు తెలిపింది.ముఠాకు సాహిల్ పటేల్ నాయకత్వం వహించినట్టు కోర్టు నిర్ధారించింది.
రెవిన్యూ అధికారులమని చెప్పి పన్ను చెల్లింపుదారుల్ని భయభ్రాంతులకు గురి చేసినట్టు కోర్టు అభిప్రాయపడింది. 2011 డిసెంబర్ నుంచి 2013 డిసెంబర్లో తాను అరెస్ట్ అయ్యేంతవరకూ పటేల్ చేసిన మోసాలకు 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు పది లక్షల అమెరికన్ డాలర్ల జరిమానాను కోర్టు విధించింది. ఐఆర్ఎస్ ఏజెంట్ల పేరుతో లంచం డిమాండ్ చేశారంటూ బాధితుల నుంచి 2013 వరకూ 5 లక్షల 91 వేల ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు.