Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్ : ట్రాన్స్ జెండర్లను ధర్డ్ జెండర్గా సుప్రీం కోర్టు గుర్తించినా వారు సమాజంలో వివక్షను ఎదుర్కోంటూనే ఉన్నారు. అందుకే వారి కోసం దేశంలో మోదటిసారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో ప్రత్యేక విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. మోట్టమోదటి ట్రాన్స్ జెండర్ ఎమ్మెల్యే ఎన్నికైంది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే..ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ట్రాన్స్ జెండర్లకోసం ప్రత్యేక విద్యాకేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతోంది. దీన్ని భోపాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర నిర్వహణను ప్రభుత్వేతర స్వచ్ఛందసంస్థలకు అప్పగించనుంది.