Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోప్ ఫ్రాన్సిస్
శాంతాక్రుజ్: భూమి, ఇల్లు, పని పేద ప్రజల పవిత్ర హక్కులుగా పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. లాటిన్ దేశాల పర్యటనలో భాగంగా బొలీయాలోని శాంతా క్రుజ్ నగరంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన సందేశమిచ్చారు.పోప్ ఫ్రాన్సిస్ను ఆహ్వానిస్తూ బొలీవియా అధ్యక్షుడు ఎవోమొరాలెస్ స్వాగతోపా న్యాసమిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్షవాదియైన ఎవోమొరాలెస్ చేగువేరా బొమ్మ ఉన్న చొక్కా ధరించారు. అప్పట్లో సిఐఏ ఏజెంట్లుగా వ్యవహరించిన బొలీవియా పోలీ సులు 1967లో చేగువేరాను చంపేశారు. పోప్ తన సుదీర్ఘ ప్రసంగంలో పేదల పక్షపాతిగా పలు వ్యాఖ్యలు చేశారు. అర్జెంటీనాకు చెందిన పోప్ క్షమించడం కేథలిక్ చర్చి ధర్మంగా చెప్పారు. పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించిన పోప్ నూతన ఆర్థిక విధానం రావాలన్నారు. పేదలను అణచివేసే ఆర్థిక విధానాలను వ్యతిరేకించాలని స్పష్టం చేశారు. మనం మార్పును కోరుకునేందుకు భయపడొద్దు, నిర్మాణాత్మక మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా ప్రజలను అణచివేసే ఆర్థిక విధానాలు నూతన వలసవాదంగా పోప్ అభివర్ణించారు. గ్రీస్ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా మానవ హూందాతనాన్ని కాపాడుకోవాలని యూరోపియన్ దేశాలకు పిలుపునిచ్చారు. తమ దేశంలో పోప్ పర్యటన సందర్భంగా బొలీవియా అధ్యక్షుడు ఆయనకు అరుదైన కానుకనిచ్చారు. చెక్కతో చేసిన సుత్తీ-కొడవలిని పోప్కు బహుమతిగా అందించారు. సుత్తిపై క్రీస్తు బొమ్మ చెక్కి ఉంది. లాటిన్ దేశాల పర్యటనలో భాగంగా పోప్ శుక్రవారం పరాగ్వే బయలుదేరి వెళ్లారు.