Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా : పశ్చిమ బంగ్లా మైమేన్ సింగ్ నగరంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 23మంది మృతి చెం దారు. మరి కొంత మంది తీవ్రం గా గాయ పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. కాగా రంజాన్ పవిత్ర మాసంలో అందించే దానధర్మాల్లో భాగం గా ఓ వ్యాపారి పేదలకు బట్టలు, బహుమతులను పంపిణి చేశాడు. ఈ క్రమం లో బహుమానాలను అందుకునేందుకు వేల సంఖ్యలో జనం గుమిగూడి తొక్కి సలాట ఏర్పడటంతో 23మంది మృతి చెందా రు. దాంతో ఇంటి యజమానిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకై త్రిసభ్య కమి టీ ని ఏర్పాటు చేశామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే మూడు రోజుల్లో త్రిసభ్య కమిటి అందించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా ఇదే తరహాలో తాంగేల్ నగరంలోని ఓ వస్త్ర కర్మాగారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 40మంది మృతి చెందారు.