Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా అప్రమత్తం
బీజింగ్ : చాన్-హోమ్ అనే బలమైన తుపాను చైనాను తాకనుంది. అక్కడి జెజియాంగ్ ప్రావిన్స్లో ఈ తుపాను తీరాన్ని దాటనుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రావిన్స్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపుగా 10 వేల మంది జాలర్లను పడవలతో సహా తీరం నుంచి వేరే ప్రాంతాలకు పంపించివేశారు.
ఈ తుఫాను తీరానికి 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 187 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని శుక్రవారం లేదా శనివారం తెల్లవారుజాములోపు ఆ తుపాను తీరాన్ని తాకే అవకాశాలున్నాయని తెలిపింది.