Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెయిరో: దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ముస్లిం బ్రదర్హుడ్, ఇతర ఉగ్రవాద సంస్థలు పన్నినకుట్రను భగం చేసిన సైనిక దళాలకు తాము అభినందనలు తెలియచేస్తున్నట్లు ఈజిప్ట్ కమ్యూనిస్టు పార్టీ (ఇసిపి) ఒక ప్రకటనలో పేర్కొంది. అటార్నీ జనరల్ హత్య తరువాత సినరు, తదితర ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద చర్యలు దేశంలో రక్తపాతాన్ని సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలు పన్నిన కుట్రలను ప్రతిబింబిస్తున్నాయని ఇందులో మీడియాలోని ఒక వర్గం పావులా ఉపయోగపడిందని ఇసిపి తన ప్రకటనలో వివరించింది. సామ్రాజ్యవాద శక్తులు, ఈ శక్తులకు తోకలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాంతంలోని దేశాలు ముఖ్యంగా కతార్, టర్కీ ప్రయోజనాలను కాపాడేందుకు ఉగ్రవాద శక్తులు ఈ కుట్రలకు పాల్పడ్డాయని ఇసిపి తన ప్రకటనలో పేర్కొంది.
కేవలం ఒక్కసారి నిరోధించినంత మాత్రాన ఉగ్రవాద శక్తులు తమ కుట్రలను ఆపబోవని, ఈ శక్తులకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు అప్రమత్తతో ఓపికతో వ్యవహరించాలని, ఈ పోరాటం ఎంత కాలం కొనసాగుతుందన్న విషయం ప్రధానం కాదని ఇసిపి తన ప్రకటనలో స్పష్టం చేసింది.