Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్లో 5వ శతాబ్దం నాటి ఖడ్గం బయటపడింది. ఆ ఖడ్గం కింగ్ ఆర్థర్కు చెందినదిగా అధికారులు వెల్లడించారు. ఈ ఖడ్గం పొడవు 1.2 మీటర్లు ఉన్నదన్నారు. 5వ శతాబ్దంలో కింగ్ ఆర్థర్ను కొందరు దుండగులు హత్య చేశారు. అనంతరం అతని మృతదేహాన్ని, ఖడ్గాన్ని కార్నిష్ సరస్సులో పారేసినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తాజాగా బయటపడ్డ ఖడ్గం కూడా అదే సరస్సులో లభించిందని అధికారులు తెలిపారు. కార్నిష్ సరస్సులో ఈతకెళ్లిన మటిల్డా జోన్స్ అనే ఏడేండ్ల చిన్నారికి ఖడ్గం దొరికిందన్నారు.
ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఖడ్గాన్ని స్వాధీనం చేసుకుని పురాతన వస్తుప్రదర్శనశాలకు తరలించామని అన్నారు. కింగ్ ఆర్థర్ ఖడ్గాన్ని అందజేసిన మటిల్డాను అధికారులు ఈ సందర్భంగా ప్రశంసించారు. త్వరలో ప్రభుత్వం తరుఫున రివార్డు, ప్రశంసా పత్రం అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మటిల్డా మాట్లాడుతూ...తండ్రి పాల్ తనకు కింగ్ ఆర్థర్ జీవిత విశేషాలు, కథలు చెప్పేవారని అన్నారు. దుండగులు కింగ్ ఆర్థర్ను హత్య చేసి కార్నిష్ సరస్సులో పడేసినట్టు తండ్రి ద్వారా తెలిసిందన్నారు. రాజు కత్తి ఎలా ఉంటుందో చూడాలనే ఆతృతతోనే సరస్సులో అన్వేషణ ప్రారంభించి సఫలీకృతమయ్యానని అన్నారు.