Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఉగ్రవా దంపై పాక్ అనుసరిస్తున్న వైఖరి మారాల్సిందేనని అమెరికా గట్టిగా కోరింది. చైనాలో 'బ్రిక్స్' సమావేశం విజయవంతం కావడంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తున్న 'బ్రిక్స్' శిఖరాగ్ర సమావేశంలో పాక్లోని ఉగ్రవాద ముఠాలను నియంత్రించాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా ప్రతినిధి హర్షం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదుల ముఠాలను నియంత్రించాలని పాక్కు సూచించింది. బ్రిక్స్ తీర్మానంలో ఆఫ్ఘన్ తాలిబాన్, ఇస్లామిక్స్టేట్, అల్ఖైదా, హక్కానీ ఉగ్రవాదులు, లష్కర్, జైష్ ఎ మహమ్మద్, తెహ్రిక్ తాలిబాన్ పాకిస్థాన్, హిజ్బుల్ తహ్రీర్ గ్రూపులను ప్రస్తావించారు. 'బ్రిక్స్'లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్నాయి. బ్రిక్స్ వేదికగా తొలిసారి పాక్, ఆఫ్ఘన్లోని ఉగ్రవాదుల ముఠాలను నిర్మూలించాలని తీర్మానం చేయడం విశేషం.
ఉగ్రవాదులకు నిధులు అక్కడ నుంచే..
ఉగ్రవాదులకు నిధులను సమకూర్చడంతో పాటు ప్రజాసొమ్మును అక్రమ మార్గాల ద్వారా తరలించేందుకు వీలుగా పాక్ ఉందని స్విస్ అధ్యయనకేంద్రం 'బసెల్' తెలిపింది. ఈ విభాగంలో పాక్ 46వ స్థానంలో ఉందని వెల్లడించింది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్థాన్, లావోస్, మొజాంబిక్, మాలి, ఉగండా, కాంబోడియా... తదితర దేశాలనుంచి మనీలాండరింగ్ ఎక్కువగా జరుగుతోందని నివేదికలో వెల్లడైంది. మనీలాండరింగ్ నియంత్రణలో ఫిన్లాండ్, లిథ్వేనియా, ఎస్టోనియా, బల్గేరియా, న్యూజిలాండ్, స్లోవేనియా, డెన్మార్క్... తదితర దేశాలు కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని 'బసెల్' ప్రశంసించింది.