Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొన్న భూకంపం..నేడు 'కతియా' తుఫాన్
- భయంతో నిద్రపోలేక పోతున్న నగర ప్రజలు
రాజధాని మెక్సికోసిటీలో 1985లో వచ్చిన భూకంపంలో 1000 మందికిపైగా చనిపోయారు. మళ్లీ కొన్ని దశాబ్దాల తర్వాత అంతటి భయానక భూకంపం గురువారం రాత్రి సంభవించింది. దీని నుంచి మెక్సికోసిటీ తప్పించు కోవటంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. కానీ ఆనాటి భయం నగర ప్రజల మనసు నుంచి పోలేదు. గురువారంనాటి భూకంపం పట్ల వారు స్పందించిన తీరులో ఆ భయం స్పష్టంగా కనపడింది. గురువారంనాడు భూకంప హెచ్చరికలు రాగానే అనేక చోట్ల భవనాల పై నుంచే దూకేసిన దాఖలాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం నగర ప్రజలు నిద్ర పోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. వివిధ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో భవనాలు బీటలు వారాయని, 428 ఇండ్లు ధ్వంసమయ్యాయని మెక్సికో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
టెకొలుట్లా : మెక్సికోపై ప్రకృతి కన్నెర్ర చేసిందా ?... అన్నట్టు ఉంది పరిస్థితి ! కొన్ని గంటల వ్యవధిలో భూకంపం, తుఫాన్ వరుసగా అక్కడి ప్రజలపై విరుచుకుపడ్డాయి. ఊహించని ఈ విపత్తుతో మెక్సికో ప్రజలు విలవిల్లాడుతు న్నారు. గురువారం రాత్రి దక్షిణ మెక్సికో తీరం భూకంపం తాకి డికి వణికిపోగా...నేడు తూర్పు మెక్సికోపై 'కతియా' తుఫాన్ తన ప్రతాపం చూపుతున్నది. మెక్సికో గల్ఫ్లో పుట్టిన 'కతియా' తుఫాన్ శనివారం ఆ దేశ తూర్పు తీరాన్ని తాకింది. శనివారం ఉదయం వెరాక్రూజ్ రాష్ట్రాన్ని తాకినట్టు అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. అయితే ప్రారంభంలో తీవ్రత రెండో స్థాయిలో ఉన్న ఈ హరికేన్ క్రమంగా బలహీ నంగా మారి.. ఒకటో స్థాయికి పడిపోయింది. కతియా ప్రభా వంతో ప్రస్తుతం వెరాక్రూజ్ రాష్ట్రం సమీపంలో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ తుఫాన్ కారణంగా వెరాక్రూజ్, తూర్పు హిదాల్గో, ప్యూబ్లాలో 10 నుంచి 15 అంగుళాల వర్షపాతం నమోదయ్యే అవకాశముం దని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే దక్షిణ మెక్సికోను అత్యంత శక్తిమంతమైన భూకంపం కుది పేసింది. 8.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి 3.3 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. భూకంపం కారణంగా అనేక ఇండ్లు, భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు నేలమట్టమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
61 చేరిన భూకంపం మృతుల సంఖ్య ఈ భూకంపం సృష్టించిన బీభత్సంలో ఇప్పటి వరకు 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన టబాస్కో, ఒయాక్సాకా, చియపస్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండగా.. వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
భూకంపం నేపథ్యంలో మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో ప్రకటించారు. మృతులకు నివాళిగా జాతీయ జెండాలను అవతనం చేశారు. ఒక్క ఒయక్సాకాలోనే 45 మంది మృతి చెందగా.. చియపస్లో 12 మంది, టబాస్కోలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ప్రకంపనలు పొరుగునే ఉండే గ్వాటెమాలా వరకు వ్యాపించాయి. గ్వాటెమాలాలో కూడా ఒకరు చనిపోయినట్టు సమాచారం.