Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
ప్యాంగ్యాంగ్ : ఉత్తరకొరియా అణుశాస్త్రవేత్తలను అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గౌరవించారు. ఉత్తరకొరియా 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ప్యాంగ్యాంగ్లో భారీ సభను ఏర్పాటు చేసిన కిమ్.. శాస్త్రవేత్తలను సత్కరించారు. అణ్వస్త్రాల సముపార్జనలో దేశం ముందడుగు వేయటంలో శాస్త్రవేత్తల, ఇతర సిబ్బంది చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. హైడ్రోజన్ బాంబు పరీక్ష విజయవంతమవ్వడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారని, ఉత్తరకొరియా ప్రజలు సాధించిన గొప్పవిజయంగా ఆయన పేర్కొన్నారని ప్రభుత్వ ఆధీనంలోని 'కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ'(కేసీఎన్ఏ) ప్రకటించింది.