Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : మయన్మార్లో రో హింగ్యా ముస్లింలపై సాగుతు న్న హింసాకాండను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఒక జాతిని ప్రత్యేకంగా లక్ష్యం గా చేసుకొని అంతమొందించిన ఉదంతాలు చరిత్ర పాఠాల్లో ఉన్నాయని, ప్రస్తుతం రోహిం గ్యాల పరిస్థితి చూస్తుంటే అది గుర్తుకు వస్తున్నదని, మయన్మా ర్ మిలటరీ అత్యంత క్రూరమైన మిలటరీ ఆపరేషన్ చేపట్టిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కు ల విభాగం చీఫ్ జైద్రాద్ అల్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. గత నెలరోజులుగా మయ న్మార్లో రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి ఆయన జెనీవాలో జరిగిన మా నవ హక్కుల కౌన్సిల్ సమావే శంలో తెలియజేశారు.
''మయన్మార్లో ఓ వైపు వారు హింసాకాండను ఎదు ర్కొంటుంటే, ఇలాంటి పరిస్థితి లో శరణార్థులైన వారిని వెళ్ల గొడతామని భారత విదేశాంగ శాఖ ప్రకటించటం దారుణం. కనీస మానవతా దృక్పథాన్ని భారత్ చూప లేదు'' అని అల్ హుస్సేన్ అన్నారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..
హింసాకాండ నేపథ్యంలో మయన్మార్లోని రఖైనా రాష్ట్రం నుంచి గత నెలరోజుల్లో 3 లక్షల 10వేల మంది ప్రాణాలు అరచేత పట్టుకొని బంగ్లాదేశ్కు పారి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నదులు, వాగులు, వంకలు, సముద్రాలు దాటి సురక్షిత ప్రాంతాలకి వెళ్లి ప్రాణాలు రక్షించుకునే ప్రయ త్నం చేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం లో ఎన్నో వేలమంది దిక్కూ మొక్కూ లేకుండా పడివున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఏదేశమైనా తమను ఆదుకోకపోతుందా, ఆశ్రయం ఇవ్వకపోతుందా అన్న ఆశతో బంగ్లా సరిహద్దులో రోహింగ్యాలు చెట్ల కింద కాలం వెళ్లదీస్తున్నారు.