Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు దిగుమతులు, టెక్స్టైల్స్ ఎగుమతులపై నిషేధం
వాషింగ్టన్: ఉ.కొరియాపై తీవ్రమైన ఆంక్షలు విధించాలన్న అమెరికా, దాని మిత్ర దేశాల ఒత్తిడికి ఐక్యరాజ్యసమితి తలొగ్గింది. ఆ దేశంపై మళ్లీ తీవ్రమై న ఆంక్షల్ని విధించాలన్న తీర్మానాన్ని భద్రతామండలి సోమవారం ఆమోదించింది. ఈనేపథ్యంలో ఉ.కొరి యా ముడి చమురు దిగుమతులపై, టెక్స్టైల్ ఎగు మతులపై నిషేధం విధించారు. తద్వారా ఉ.కొరియా ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టాలన్న అమెరికా ప్రయత్నం ప్రస్తుతానికి నెరవేరిందనే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం ఉ.కొరియా అణు పరీక్షలు జరిపినందుకుగాను మళ్లీ ఆదేశంపై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను అమె రికా, జపాన్, ద.కొరియా తదితర దేశాలు భద్రతా మండలి ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
తీర్మానంపై 15 సభ్య దేశాల భద్రతా మండలి సుదీర్ఘమైన చర్చలు జరిపి...ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కఠినమైన ఆంక్షల విధింపునకు చైనా, రష్యాలు తొలి నుంచి విముఖత వ్యక్తం చేసినప్పటికీ, అమెరికా దాని మిత్రదేశాలు చైనా, రష్యాలపై తీవ్రమై న ఒత్తిడి తీసుకొచ్చాయి. కొన్ని అంశాల్లో చైనా, రష్యా లు అభ్యంతరం వ్యక్తం చేయటంతో వాటిని తీర్మానం నుంచితొలగించారు. ఈఆంక్షల తర్వాత కూడా ఉ. కొరియా తన అణుకార్యక్రమాన్ని నిలుపుదల చేయక పోతే, తాము ప్రత్యేకంగా మరిన్ని చర్యలు చేపడతా మని జపాన్, ద.కొరియాలు తెలియ జేశాయి.
2006 నుంచి ఇప్పటిదాకా ఉ.కొరియాపై ఆం క్షలు విధించటం ఇది తొమ్మిదవసారి. భద్రతా మండ లిలో ఓటింగ్ ముగిసిన అనంతరం ఐరాసలో అమెరి కా రాయబారి నిక్కీ హాలే మాట్లాడుతూ.. ''మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదు. ఆంక్షల విధింపుద్వారా మేము సంతోషపడటం లేదు. ఉ.కొరియా ఒకవేళ తన అణుకార్యక్రమాన్ని ఆపివేస్తే...ఆ దేశ భవిష్యత్తు కు మంచిది. లేదంటే...మా ఒత్తిడి కొన సాగుతుంది'' అని అన్నారు. 93వేలమంది ఉ.కొరి యా కార్మికులు విదేశాల నుంచి పంపుతున్న డబ్బుపై పెద్దఎత్తున పన్నులువిధించామని ఆమె తెలియజేశారు.
- ఉ.కొరియా ప్రతీ ఏటా దిగుమతి చేసుకుం టున్న ముడి చమురు 40లక్షల బ్యారెల్స్. శుద్ధిచేసిన ముడి చమురు ఉత్పత్తులు 45 లక్షల బ్యారెల్స్. తాజా ఆంక్షల విధింపు కారణంగా ఇకనుంచి ఆ దేశం శుద్ధిచేసిన చమురు ఉత్పత్తులు ఏడాదికి 20లక్షల బ్యారెల్స్ మాత్రమే దిగుమతి చేసుకోగలుగుతుంది. ముడు చమురు ఎగుమతులు అత్యధికభాగం చైనా నుంచి జరుగుతున్నాయి.
- ఉ.కొరియాపై కఠినమైన ఆంక్షల విధింపును చైనా, రష్యాలు వ్యతిరేకించాయి. ప్రయివేట్ సంభాషణల్లో తమ తమ ఆందోళనల్ని వ్యక్తం చేశాయి. ఈ చర్య కొరియా ద్వీపకల్పంలో మరింత అస్థిరతను తీసుకొస్తుందని ఆ దేశాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉ.కొరియాతో చర్చల మార్గాన్ని ట్రంప్ సర్కార్ వదిలేసిందని చైనా ప్రభుత్వ ఆధీనంలోని 'జిన్హువా' వార్తా ఏజెన్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌత్యమార్గాల్ని ట్రంప్ సర్కార్ పక్కనపెట్టడం పెద్ద తప్పు అని, ఉ.కొరియాను ఒంటరి చేసే ప్రయత్నమని, మళ్లీ ఆంక్షల కారణంగా ఆ దేశం మరిన్ని అణు పరీక్షలు జరపడానికి మార్గం ఏర్పడిందని 'జిన్హువా' పేర్కొన్నది.