Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
సియోల్ : ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి తమపై మరిన్ని ఆంక్షలు మోపేందుకు కుట్రపన్నిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విమర్శించారు. ఐరాస ఆంక్షలకు తలొగ్గేది లేదని మరోమారు స్పష్టం చేశారు. సైనికుల సంఖ్యను పెంచడంతో పాటు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. 1945లో జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా ప్రయో గించిన అణుబాంబు కంటే తాము తయారు చేసిన హైడ్రోజన్ బాంబు 16రెట్లు పెద్దదని కిమ్ అన్నారు. ఈ బాంబును ప్రయోగిస్తే దాని ప్రభావం 250 కిలోమీటర్ల వరకు ఉంటుందని అమెరికాను పరోక్షం గా హెచ్చరించారు. ఉ. కొరియాపై చర్యలు తీసుకో వాలని భద్రతా మండలిలో అమెరికా ఒత్తిళ్లు పెంచిం దన్నారు. ఐరాస భద్రతా మండలి తమపై ఆంక్షలు మోపినా వెనక్కి తగ్గేది లేదన్నారు. కాగా, ఉ. కొరియాపై ఆంక్షలు మోపేందుకు ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలు ఏకగ్రీవంగా సోమవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే,పలు తీర్మానాల పట్ల రష్యా, చైనా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాగా, ఉ.కొరియాపై కఠిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ రించారు. ఉ.కొరియాపై చర్యలు చేపట్టాలని ప్రవేశ పెట్టిన తీర్మానానికి ఐరాస భద్రతామండలిలోని 15 సభ్యదేశాలు మద్దతు పలికాయన్నారు.
ఉత్తర కొరియాతో శాంతి చర్చలు అనివార్యం : ఉ.కొరియాతో అమెరికా శాంతి చర్చలు నిర్వహిం చాలని యూఎస్ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అభిప్రాయపడ్డారు. దీంతో, ఇరుదేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు సమిసిపోతాయని అన్నారు. దేశాధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి శాంతి స్థాపనకోసం కృషి చేయాలని హితవు పలికారు. దేశ పౌరుల నుంచి రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించవచ్చునని 2010లో యూఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తప్పు పట్టారు. రాజకీయాల్లో నైతిక విలువలు లోపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని అధ్యక్షుడు ట్రంప్ పరిష్కరిస్తారని తాను భావించడంలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.