Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నసిరియా: ఇరాక్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఒకే చోట రెండు సార్లు దాడికి దిగారు. నసిరియా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన కొద్ది సమయానికి దగ్గర్లోని భద్రతా సిబ్బంది చెక్ పాయింట్ వద్ద కారు బాంబుతో దాడి చేశారు. ఈ దాడుల్లో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయ్యారు. మరో 87 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని భద్రతాబలగాలు తెలిపాయి.
అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఒకరి మృతి
అమెరికా స్కూల్లో మళ్లీ తుపాకీ గర్జించింది.. ఒక నిండు ప్రాణం బలైంది. ఓ విద్యార్థి తనతో పాటు స్కూలుకు తెచ్చిన తుపాకితో తోటి స్నేహితులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మొదట ముగ్గురు మరణించారని భావించినా.. చివరకు ఒకరు చనిపోయారు.. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వాషింగ్టన్లోని రాక్ఫోర్డ్ అనే ప్రాం తంలో ఉన్న ఫ్రీమాన్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. 15ఏండ్ల ఒక విద్యార్థి స్కూలుకు తనతో పాటు రైఫిల్, హ్యాండ్గన్ వెంట తెచ్చుకున్నాడు. షూటింగ్ ప్రాక్టీస్ అని స్నేహితులకు చెప్పి కాల్పులు మొదలు పెట్టాడు.