Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : జపాన్ మీదుగా ఉత్తరకొరియా మరో క్షిపణి పరీక్ష నిర్వహించింది. ప్యాంగ్యాంగ్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇది జపాన్ మీదుగా వెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో పడినట్టు సమాచారం. తాజా క్షిపణి ప్రయోగంపై జపాన్, అమెరికా, దక్షిణ కొరియా తీవ్రంగా మండిపడ్డాయి. మూడు వారాల క్రితం జపాన్ భూభాగం మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. రెండో సారి క్షిపణి ప్రయోగం చేపట్టడంపై జపాన్ మండిపడింది. ఉత్తర కొరియా చర్యలను ఉపేక్షించబోమని జపాన్ ప్రధాని షింజో అబే హెచ్చ రించారు. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాన్ని అమెరికా కూడా ధ్రువీక రించింది. జపాన్ మీదుగా పసిఫిక్ మహా సముద్రంలోకి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని అమెరికా పసిఫిక్ కమాండ్ పేర్కొంది. అయితే దీనివల్ల అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.