Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఆ దేశ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పనామా కేసులో షరీఫ్ వేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది. అవినీతి కేసులో షరీఫ్ను దోషిగా ప్రకటిస్తూ జూలై 28న ఇస్లామాబాద్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తీర్పు వల్లే ప్రధాని పదవికి షరీఫ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అనర్హత వేటు వల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకు న్నారు. అయితే పనామా పత్రాల కేసులో తీర్పును మళ్లీ పరిశీలించాలని షరీఫ్తో పాటు ఆయన పిల్లలు రివ్యూ పిటిషన్ వేశారు. దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్లు కొట్టిపారేసింది. అయితే ఎందుకు కొట్టివేశారన్న తీర్పుకు కారణాలను తర్వాత వెల్లడించనున్నట్టు జస్టిస్ ఖోసా చెప్పారు. న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా మాజీ ప్రధానిని కోరింది.