Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: అండర్ గ్రౌండ్ మెట్రో రైల్లో పేలుడు జరగడంతో లండన్ నగరం ఉలిక్కిపడింది. శుక్రవారం ఉద యం పశ్చిమ లండన్ పార్సన్స్ గ్రీన్ ట్యూబ్ స్టేషన్ వద్ద మెట్రోరైల్లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు కాలిన గాయాలయ్యాయి. పేలుడుతో ఒక్క సారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇది ఉగ్రవాద దాడే నని పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఈ ఘటనను ఉగ్రవాద దాడిగానే పరిగణిస్తున్నామని, ఈ ఏడాది బ్రిటన్లో పలు ఉగ్రవాద దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఉగ్రకోణంలోనే దర్యాప్తు చేపడుతున్నామని లండన్ పోలీ సులు స్పష్టం చేశారు. ట్యాబ్ ట్రెయిన్లో గుర్తు తెలియని వ్యక్తి వదిలిన బ్యాగ్ పేలిపోవటంతో ప్రమాదం సంభవించినట్టు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు సమచారం తెలుసుకున్న భద్రతా దళాలు, బాంబ్ స్క్వాడ్, సహాయక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఆ మార్గంలో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అండర్ గ్రౌండ్ రైలులో పేలుడు నేపథ్యంలో ఎవరూ భయాందోళనకు గురికావొద్దని, సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దని బ్రిటన్ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ ప్రజలను కోరారు.
- ఓ తెలుపు రంగు బకెట్లో పేలుడు సంభవించి దాని నుంచి మంటలు వస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది, ఒక బకెట్లో మంటలు చెలరేగడం గమనించానని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. ప్రజలందరూ భయబ్రాంతులకు గురై బిగ్గరగా కేకలు వేస్తూ ఏడుస్తున్నారు, ఆ ప్రాంతమంతా రక్తపు మరకలు ఉన్నాయని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.7బ్రిటన్ ఈ ఏడాది వరుస ఉగ్రదాడులతో వణికిపోతోంది. నెలల వ్యవధిలోనే ఉగ్రవాదులు అనేకసార్లు మారణహోమం సృష్టించారు. మార్చి నెలలో పార్లమెంటు సమీపంలో కారు బీభత్సం సృష్టించిన కొద్దిసేపటితో ఓ వ్యక్తి కత్తితో ప్రజలపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం మే నెలలో మాంచెస్టర్లోని రాక్ కన్సర్ట్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిని మరువకముందే జూన్ నెలలో లండన్ బ్రిడ్జిపై ఆగంతకుడు వ్యాన్తో పాదచారులపైకి దూసుకెళ్లి ప్రజల ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే కత్తితో మరో ఉగ్రవాది అక్కడ ఉన్న రెస్టారెంట్లోకి వెళ్లి బీభత్సం సృష్టించాడు.