Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడి మా పనే : ఐఎస్
లండన్ : లండన్ భూగర్భ రైలు పేలుడు ఘటనకు సంబంధించి 18ఏండ్ల యువకుడ్ని బ్రిటన్ పోలీసులు అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం శుక్రవారం నుంచి లండన్ అంతటా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే శనివారం దోవర్ ప్రాంతంలో అనుమానాస్పద యువకుడ్ని కెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి అతడిని విచారిస్తున్నట్టు మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. బాంబు పేలుడు జరిగిన 24గంటల్లోపే ఈ ఘటనకు సంబంధించిన ఒకరిని టెర్రరిజం యాక్ట్ కింద అరెస్టు చేసినట్టు పోలీస్ అధికారి నీల్ బసు తెలిపారు. బకెట్ బాంబు పేలుడు ఘటనలో దాదాపు 30 మంది గాయపడ్డారు. ఈ ఏడాది బ్రిటన్లో జరిగిన ఐదో ఉగ్రదాడి ఇది. దీంతో లండన్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భూగర్భ రైలులో జరిగిన బాంబు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్టు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని బ్రిటన్ మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. 'లండన్ మెట్రోలో బాంబును పేల్చాం.' అంటూ ఐఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది.