Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: అంతర్జాతీయంగా ఉ.కొరియాపై ఒత్తిడి పెరుగుతున్నది. కువైట్లోని ఉత్తరకొరియా రాయబారి, మరో నలుగురు దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు పడనున్నదని సమాచారం ! ఐరాస తాజా ఆంక్షల నేపథ్యంలో, ఉత్తరకొరియాతో సంబంధాలు తెంచుకోవాలని ఆయా దేశాలపై అమెరికా, దాని మిత్ర దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉ.కొరియా రాయబారుల్ని బహిష్కరించాలన్న దిశగా కువైట్ అడుగులు వేసినట్టు తెలుస్తున్నది. గల్ఫ్ దేశాలన్నింటిలో ఉత్తరకొరియాకు రాయబార కార్యాలయం ఉన్నది ఒక్క కువైట్లోనే. కువైట్, ఒమన్, ఖతార్, యూఏఈ లాంటి దేశాల్లో ఉత్తరకొరియా పౌరులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. వారి ద్వారా ఆ దేశానికి వస్తున్న ఆదాయాన్ని క్షిపణి ప్రయోగాలకు ఉపయోగిస్తోందని అమెరికా, దాని మిత్రదేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. వీరు పంపిస్తున్న ఆదాయంపై ఆయా దేశాలు పన్నులు వేయాలని కూడా అమెరికా ఒత్తిడి తీసుకొస్తున్నది.