Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మయన్మార్ ప్రభుత్వనేతగా సూచీ తగిన చర్యలు తీసుకోవాలి
- లేదంటే..రోహింగ్యాల సమస్య మరింత జటిలం :ఐరాస ప్రధాన కార్యదర్శి
ఆంటోనియో గుటెర్రస్
నోబెల్ శాంతి బహుమతి అందుకున్న అంగ్సాన్ సూచీ మయన్మార్ ప్రభుత్వ నాయకురాలు. గొప్ప నేపథ్యమున్న నేత అయిన అంగ్సాన్ సూచీ, రోహింగ్యా ముస్లింలపై హింసాకాండను అడ్డుకోలేకపోయారు. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దేశాధినేతగా సమస్య పట్ల ఆమె స్పందించిన తీరును అందరూ తప్పుబడుతున్నారు. సమస్యపై ఆమె సరిగ్గా వ్యవహరించలేదని ఐక్యరాజ్యసమితి కూడా భావిస్తున్నది. దీంతో ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాలకు అంగ్సాన్ సూచీ డుమ్మా కొడుతున్నారు.
బంగ్లాదేశ్ సరిహద్దులో శరణార్థులుగా చేరుకున్న రోహింగ్యాల సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. వీరందరికీ షెల్టర్స్ ఏర్పాటుచేసి, తగినవిధంగా ఆశ్రయం కల్పించామని బంగ్లాదేశ్ చెబుతున్నప్పటికీ...అది పూర్తి నిజం కాదు. నిర్ణీత ప్రదేశంలో శరణార్థులందరినీ బంగ్లాదేశ్ పోలీసులు నిర్బంధించారన్న వార్తలు వెలువడుతున్నాయి. శరణార్థులుగా వచ్చినవారిని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఉండకుండా బంగ్లా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మయన్మార్కుగానీ, లేదా మరోదేశానికిగానీ రోహింగ్యాలను పంపాలన్న ఉద్దేశంతోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నది.
న్యూయార్క్ : మయన్మార్లో రోహింగ్యా ముస్లింలపై కొనసాగుతున్న హింసాకాండకు వెంటనే ముగింపు పలకాలని, లేదంటే ఈ సమస్య మరింత భీకరరూపం దాల్చుతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్ సైన్యం చేస్తున్న దాడులను ఆపాలని ఆ దేశ స్టేట్ కౌన్సెలర్ (ప్రధాని) అంగ్సాన్ సూచీని ఆయన కోరారు. ఇప్పటికైనా ఆమె తగిన చర్యలు తీసుకోకపోతే...భవిష్యత్తులో పరిస్థితి మరింత భయం కరంగా మారుతుందని గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. శరణార్థులగా మారే సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుటెర్రస్ పై వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా ముస్లిం శరణార్థుల సమస్య గురించి ఆయన ఇంకా ఏమన్నారంటే...
''రోహింగ్యా ముస్లింలు లక్షల సంఖ్యలో శరణార్థులుగా మారుతున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలి..అంటే, వారిని వెంటనే మయన్మార్కు తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలి. లేదంటే...ఈ సమస్య అటు తిరిగి...ఇటు తిరిగి ఏ రూపం సంతరించుకుంటుందోనన్న ఆందోళన నాలో ఉంది. మయన్మార్లో ప్రజా ప్రభుత్వం (అంగ్సాన్ సూచీ నేతృత్వం లో) ఉన్నప్పటికీ, అక్కడ ఇంకా సైన్యానిదే పెత్తనం. రఖైనా రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపై దాడులు సైన్యం పనే. క్షేత్రస్థాయిలో ఏం చేయాలన్నది సైన్యమే నిర్ణయిస్తున్నది. హింసాకాండను సృష్టించి, రోహింగ్యాలను బెదరగొట్టి వెళ్లగొ డుతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకొని బంగ్లాదేశ్కు చేరు కున్న రోహింగ్యాల సంఖ్య 4 లక్షలు దాటింది'' అని చెప్పారు.
ఐరాస విన్నపాల్ని పట్టించుకోవటం లేదు
రోహింగ్యాలపై దాడులు ఆపండని...మేం ఎన్నోసార్లు మయన్మార్ ప్రభుత్వానికి విన్నపం చేశాం. రోహింగ్యాల సమస్యపై మేం చాలా వేగంగానే స్పందించాం. కానీ మయ న్మార్ ప్రభుత్వం ఐరాస మాటను వినిపించుకోలేదు. హింసాకాండను అడ్డుకోవటంలో ఐక్యరాజ్యసమితి ప్రయత్నా లు ఫలించలేదు.