Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గటం అమెరికాకు ఇష్టం లేనట్టుగా ఉంది. ఉ.కొరియాను రెచ్చగొట్టే చర్యల్ని పదే పదే అమలుజేస్తున్నది. సరిహద్దులో, గగనతలంలో అమెరికా, జపాన్, ద.కొరియా, తదితర దేశాలన్నీ చేస్తున్న సైనిక విన్యాసాలు ఉ.కొరియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన నాలుగు ఎఫ్-35బి యుద్ధ విమానాలు, రెండు బీ-1బీ బాంబర్స్ కొరియా ద్వీపకల్పంపై ఎగిరాయి. అమెరికా-దక్షిణ కొరియా కూటమి సైనిక సామర్థ్యానికి, ఉత్తర కొరియా సత్తాకు ఉన్న తేడాను చూపడానికే ఈ విమానాలను పంపించామని దక్షిణ కొరియా రక్షణ శాఖ పేర్కొంది. ఐరాస ఆంక్షలను బేఖాతరు చేస్తూ సెప్టెంబర్ 3న ఆరోసారి అత్యంత శక్తివంతమైన అణు పరీక్ష, గతవారం జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా నిర్వహించిన తర్వాత అమెరికా యుద్ధ విమానాలు కొరియా ద్వీపకల్పంపై ఎగరడం ఇదే తొలిసారి. అమెరికా యుద్ధ విమానాలతోపాటు దక్షిణ కొరియాకు చెందిన నాలుగు ఎఫ్-15కే జెట్ ఫైటర్లు కూడా ఇందులో పాల్గొన్నాయి. ఈ సంయుక్త విన్యాసాలను ఇలాగే కొనసాగించడం ద్వారా తమ శక్తిని మరింత పెంచుకుంటామని దక్షిణ కొరియా తెలిపింది. ఆగస్టు 31 న కూడా అమెరికా యుద్ధ విమానాలు కొరియా గగనతలంపై ప్రయా ణించాయి. ఉత్తర కొరియా ఇంతటితో తన చర్యలకు ముగింపు పల కాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఐరాసలో అమె రికా రాయబారి నిక్కీ హేలీ మరోసారి హెచ్చరించారు. ఈ విషయంపై ఐరాస సర్వ సభ్య సమావేశాల్లో డొనాల్డ్ ట్రంప్ జపాన్, దక్షిణ కొరియా అధ్యక్షులతో ఈ వారంలో సమావేశమై చర్చిస్తారని తెలిపారు.