Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూ బడ్జెట్ కోసం ఇచ్చేందుకు బ్రిటన్ క్యాబినెట్ అంగీకారం
బ్రస్సెల్స్ : బ్రెగ్జిట్ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్తో ప్రతిష్టంభనను తొలగించుకో వడానికి బ్రిటన్ సిద్ధమైంది. ఇందుకోసం 30 బిలియన్ పౌండ్లు (సుమారుగా రూ.2.60 లక్షల కోట్లు) చెల్లించేందుకు తాము సిద్ధమని బ్రిటన్ ప్రధాని థెరెసా మే తెలిపారు. 2016, జూన్ 23న నిర్వహించిన రెఫరెండంలో ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకే మెజార్టీ ప్రజలు మొగ్గు చూపారు. దీంతో లాంఛనాలన్నీ పూర్తి చేసుకొని ఆ దేశం 2019 మార్చిలో ఈయూ నుంచి బయటకు రానుంది. ఈ సంధి కాలంలో ఈయూ బడ్జెట్కు 30 బిలియన్ పౌండ్లు సమకూర్చేం దుకు థెరెసా మే అంగీకరించారు. దీనికి బ్రిటన్ క్యాబినెట్ కూడా అంగీకరించింది.
రెెండేండ్లపాటు బడ్జెట్ కోసం 90 బిలియన్ పౌండ్లు (సుమారుగా రూ.7.82 లక్షల కోట్లు) చెల్లించాలని ఈయూ డిమాండ్ చేస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం అమల్లోకి రావడం కోసం ఇందుకు అంగీకరించాలని ఈయూ నేతలు బ్రిటన్పై ఒత్తిడి తెస్తున్నారు.
బ్రిటన్ ప్రతిపాదనకు ఈయూ సభ్య దేశాలు ఆమోదం తెలుపుతాయని భావిస్తు న్నట్టు మంత్రి డామియన్ గ్రీన్ తెలిపారు. బ్రెగ్జిట్ నిర్ణయం అనంతరం, ఏర్పడ్డ సంధి కాలం(2016 జూన్-2019 మార్చి)లో ఏడాదికి కనీసం 10 బిలియన్ పౌండ్ల చొప్పున మూడేండ్లపాటు చెల్లిం చాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ తొలుత ప్రతిపాదించారు. ఈయూకు 30 బిలియన్ పౌండ్లు చెల్లించేందుకు బ్రిటన్ కేబినెట్ మంత్రులంతా అంగీకరించగా... విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.