Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హింసాకాండపై విచారం వ్యక్తం చేసిన అంగ్సాన్ సూచీ
- అంతర్జాతీయ పరిశీలకులు ఎవరైనా రావచ్చు
యాంగాన్ : వలసవెళ్లిన శరణార్థులు తిరిగి దేశానికి రావొచ్చని మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ (ప్రధాని) అంగ్సాన్ సూచీ మంగళవారం ప్రకటించారు. రోహింగ్యా ముస్లింలపై ఆగస్టు 25న జరిగిన దాడి తరువాత తొలిసారిగా ఆమె స్పందించారు. ఉత్తర మయన్మార్లోని రఖైనా రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండ తరువాత 4 లక్షల 10 వేల మంది రోహింగ్యాలు సరిహద్దు దాటి ఇతర దేశాలకు వలస వెళ్లారు. దీనిపై తొలిసారి మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్సాన్ సూచీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
శరణార్థులుగా వెళ్లిన రోహింగ్యాలు తిరిగి దేశానికి రావచ్చు.. అందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలోనే చేపడతామని ఆమె స్పష్టం చేశారు. జాతినుద్దేశించి సూచీ మాట్లాడుతూ.. మతపరమైన అంశాలతో మయన్మార్ను విభిజించాలని, ఒక జాతిని నిర్మూలించాలన్న లక్ష్యంతోనూ ప్రభుత్వం పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజలంతా శాంతి, సౌఖ్యాలతో జీవించేందుకు ప్రభుత్వం అన్నిసౌకర్యాలనూ కల్పిస్తుందని చెప్పారు. రోహింగ్యాలపై జరిగిన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. దీనిపై ఎంతో ఆవేదన చెందానని చెప్పారు. రఖైనా రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యాల్లో మెజార్టీ ప్రజలు దేశం కోసం త్యాగాలు చేశారని సూచీ గుర్తు చేశారు.
- మయన్మార్లో జరిగిన మానవహక్కుల ఉల్లంఘన, హింసాత్మక పరిణామాలను సూచీ తీవ్రంగా ఖండించారు. మయన్మార్లో మళ్లీ శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
- రోహింగ్యాలకు, ఇతర జాతులకు ఎందుకు విభేధాలు వచ్చాయి? రఖైనా రాష్ట్రంలో ఎందుకంత హింస చెలరేగింది? అంటి అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వివరాలు తెలుసుకుంటామని తెలిపారు.
- మయన్మార్కు అంతర్జాతీయ పరిశీలకులు, సంస్థలు రావచ్చని.. ఇక్కడి పరిస్థితులలు తెలుసుకోవచ్చని ప్రకటించారు.