Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్: ఉక్రెయిన్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. బీచ్లో వాలీబాల్ ఆడుతూ ప్రమాదవ శాత్తు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను హైదరాబాద్లోని హయత్నగర్ కుంట్లూరుకు చెందిన శివకాంత్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన అశోక్లుగా గుర్తించారు. వైద్య విద్య కోసం వీరు ఉక్రెయిన్కు వెళ్లారు అక్కడి జపోరోజై స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తెలుగు విద్యార్థులు శివకాంత్రెడ్డి, అశోక్ స్నేహితులతో కలిసి సరదాగా బీచ్కు వెళ్లారు. బీచ్ వద్ద వాలీబాల్ ఆడుతుండగా వీళ్ల స్నేహితుడు ప్రమాదవశాత్తు సముద్రంలోకి కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన శివకాంత్రెడ్డి, అశోక్ కూడా అలల ఉధృతికి కొట్టుకుపోయారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. శివకాంత్రెడ్డి స్వస్థలం హైదరాబాద్. మరో విద్యార్థి అశోక్ కడప జిల్లాకు చెందినవారు. ఈ సమాచారాన్ని వీరి స్నేహితులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. కాలేజీకి సెలవులు కావడంతో బీచ్ వద్దకు వెళ్లినట్లు విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు.