Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనాలో హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రారంభం
బీజింగ్: ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును చైనా గురువారం ప్రారంభించింది. 'ఫ్యుక్సింగ్'గా పిలిచే ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది బీజింగ్- షాంఘై నగరాల మధ్య రాకపోకలు సాగించనుంది. ఈ బుల్లెట్ రైలు రాకతో రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 4 గంటల 28 నిమిషాల మేర తగ్గనుంది. ఈ మార్గంలో రోజూ ఐదు లక్షలా ఐదు వేల మంది ప్రయాణిస్తుంటారు. దీంతో ఈ సర్వీసు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. 2008లో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టిన చైనా 2011లో వాటి వేగాన్ని గణనీయంగా తగ్గించింది. ఆ ఏడాది రెండు బుల్లెట్ రైళ్లు ఢకొీన్న ఘటనలో 40 మంది చనిపోగా. 190 మంది గాయపడ్డారు. అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు వాటి వేగాన్ని నియంత్రించారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత అత్యధిక వేగంతో నడిచే రైలును పునఃప్రారంభించారు. ప్రస్తుత రైలు గంటకు అత్యధికంగా 400 కి.మీల వేగంతో ప్రయాణించే వీలున్నా, 350 కి.మీలకే పరిమితం చేశారు. ఈ వేగంతో ప్రయాణిస్తే 10శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ రైలులో భద్రతకు పెద్దపీట వేశారు. ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా విపత్తు ఎదురైతే రైలు దానికదే వేగాన్ని తగ్గించుకోగలదు. రిమోట్ డేటా ట్రాన్స్మిషన్ సిస్టమ్తో కూడిన ఈ రైలులోని అన్ని బోగీల్లో వైఫై, మొబైళ్ల ఛార్జింగ్ పోర్టులు ఉంచారు. చైనాలో ప్రస్తుతం 20వేల కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు వ్యవస్థ ఉండగా.. 2020 నాటికి మరో 10వేల కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.