Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది ద్వైపాక్షిక సమస్య : చైనా
బీజింగ్ : కాశ్మీర్పై పెడ బొబ్బలు పెడుతున్న పాకిస్థాన్కు చైనా భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్కు మద్దతిచ్చేందుకు చైనా నిరాకరించింది. కాశ్మీర్ వివాదం ద్వైపాక్షిక సమస్య అని...చైనా స్పష్టం చేసింది. ఇది భారతదేశం, పాకిస్థాన్ మధ్య వివాదమని పేర్కొంది. దీనిలో జోక్యం చేసుకోబోమని తెలిపింది. దీంతో ఐక్యరాజ్య సమితి వేదికలపై కాశ్మీరు అంశాన్ని లేవనెత్తేందుకు పాకిస్థాన్ ఇటీవల చేసిన ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగింది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి లూ కాంగ్ మాట్లాడుతూ కశ్మీరు సమస్యపై చైనా వైఖరి సుస్పష్టంగా ఉన్నట్టు తెలిపారు. 'కాశ్మీరు సమస్య అనేది చరిత్ర వదిలేసిన సమస్య' అని పేర్కొన్నారు. భారతదేశం, పాకి స్థాన్ పరస్పరం చర్చలు జరుపుకోవాలని సూచించారు.