Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివారంతో ముగియనున్న నిషేధం గడువు
వాషింగ్టన్: ఆరు ముస్లిం దేశాల పౌరులు అమెరికా రాకుండా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ గడువు ఆదివారంతో ముగియనుంది. దీంతో ఆ దేశాల ప్రజలను అమెరికాలోకి మళ్లీ రానిస్తారా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ దేశాల పౌరులపై ట్రావెల్ బ్యాన్ను ట్రంప్ సర్కార్ విధించిన సంగతి తెలిసిందే.
అయితే ట్రావెల్ బ్యాన్ గడువు త్వరలో ముగియనున్నందున, ఆ దేశ పౌరులకు వీసాలు మంజూరు చేస్తారా ? అన్నదానిపై సందిగ్ధత చోటుచేసుకుంది. నిషేధాన్ని పొడిగించేందుకు ట్రంప్ యంత్రాగం ప్రయత్నిస్తోంది. ప్రయాణ నిషేధంపై కేసు విచారణ అమెరికా సుప్రీంకోర్టులో వచ్చేంత వరకు మరో 90 రోజుల పాటు నిషేధాన్ని పొడిగించాలని యూఎస్ భావిస్తోంది. అప్పట్లో ప్రయాణ నిషేధంపై ఆయా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించాయి. నిషేధం ఉత్తర్వులు చెల్లవంటూ అమెరికాలోని దిగువ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిషేధం అమల్లోకి తీసుకొచ్చేందుకు అంగీకరించింది. దీంతో జూన్ నెలాఖరు నుంచి ప్రయాణ నిషేధం అమల్లోకి వచ్చింది. సుప్రీంలో ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ నెలలో విచారణ మొదలుకానున్నది.