Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని ప్రసంగంపై మాజీ హై కమిషనర్ అసంతృప్తి
ఇస్లామాబాద్ : అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఒంటరిగా మారుతోందని ఆ దేశ మాజీ హై కమిషనర్ హుస్సేన్ హక్కానీ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ఖాన్ అబ్బాసీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇటువంటి పరిపక్వతలేని మాటల వల్ల ప్రపంచంలో పాకిస్తాన్ ఒంటరి దేశంగా మిగిలిపోయే ప్రమాదముందని హక్కానీ హెచ్చరించారు. హక్కానీ 2008-11 వరకూ అమెరికాలో పాకిస్తాన్ హై కమిషనర్గా పనిచేశారు.పాకిస్తాన్కు సరిహద్దు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, భారత్లతో సృహృద్భావపూరిత సంబంధాలు చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. కశ్మీరీలపై భారత్ అకృత్యాలు, అరాచకాలు చేస్తోందని చెప్పడం కన్నా.. కశ్మీర్లోని వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల సంఘం నుంచి ఒక బృందాన్ని కశ్మీర్కు పంపమని కోరితే బాగుండేదని చెప్పారు.