Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏదో జరగబోతోందనే సంకేతాలు
వాషింగ్టన్: ఉత్తరకొరియా సరిహద్దుల్లో అమెరికా యుద్ధవిమానాలను మొహరించింది. శనివారం రాత్రి అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు ఉ.కొరియా సరిహద్దులకు అతి సమీపంలో ప్రయాణించాయి. ఎటువంటి శత్రువునైనా ఓడించేందుకు యుద్ధానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రత్యర్థులకు అర్థంకావాలనే ఈ చర్యకు దిగినట్టు 'పెంటగాన్' వర్గాలు తెలిపాయి. అమెరికా, మిత్రపక్షాల భూభాగాలను కాపాడేందుకు పూర్తిస్థాయి సైనిక శక్తిని వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పెంటగాన్ పేర్కొంది. ఉభయకొరియాల మధ్య ఉన్న సైనిక రహిత ప్రాంతంలో అమెరికా బాంబర్గా అనుమానిస్తున్న విమానం శనివారం రాత్రి ప్రయాణించింది.
ఒక అమెరికా విమానం ఈ ప్రాంతంలో ప్రయాణించడం ఇదే తొలిసారి. ఐక్యరాజ్యసమితిలో ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి రి యాంగ్ ప్రసంగానికి సరిగ్గా కొద్ది సమయం ముందే అమెరికా విమానాలు సరిహద్దుల్లో ఎగిరాయి. ఈ ఘటనపై ఉత్తరకొరియా తీవ్రంగా స్పందించింది. - అంతర్జాతీయ గగనతలంపై అమెరికా యుద్ధవిమానాలు గస్తీ కాస్తున్నట్టు పెంటగాన్ వర్గాలు ధృవీకరించాయి. అమెరికా, మిత్రదేశాల రక్షణ విషయంలో ఎటువంటి ప్రమాద సంకేతాలు వెలువడినా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి డానా వైట్ స్పష్టం చేశారు. అవసరమైతే మిలటరీ చర్యలకు సైతం సిద్ధంగా ఉన్నామని.. అధ్యక్షడు ట్రంప్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అయన చెప్పారు.