Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు మృతి
బాగ్దాద్ : ఇరాక్లో సైనిక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఐదుగురు సైనిక అధికారులు ఉన్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వాసిత్ ప్రావిన్స్ నుంచి కుట్ నగరానికి బయలుదేరిన ఎమ్ఐ-17 హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ఇంజిన్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా కూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు.