Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 మంది మృతి
షాంగై: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢకొీనడంతో.. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 18మంది ప్రాణాలు కోల్పోయారు.చైనాలోని అన్హూరు రాష్ట్రం షుయాంగ్ పట్టణంలోని ఎక్స్ప్రెస్వే బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మంచు వల్ల ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో వస్తోన్న బస్సులు, భారీ ట్రక్కులు, కారులు సుమారు 30 వాహనాలు ఒకదానికొకటి బలంగా గుద్దుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్ధం చేసుకునేలోపే మంటలు వ్యాపించాయి. కండ్లముందే తోటి ప్రయాణికులు కాలిపోతుంటే నిస్సహాయులుగా చూస్తుండిపోయారు. ఈ ఘోరమైన ప్రమాదంలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడుకు పైగా వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, ప్రభుత్వాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరో 21 మంది గాయపడగా వీరిలో 11మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యవర్గాలు తెలిపాయి.