Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా రక్షణ మంత్రి రెక్స్ టిల్లర్సన్
శవాషింగ్టన్ : రోహింగ్యా ముస్లింల వివాదంపై దర్యాప్తు చేపట్టనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి రెక్స్ టిల్లర్సన్ తెలిపారు. రోహింగ్యా ముస్లింలపై దాష్టీకానికి పాల్పడుతు న్న అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (అర్సా) ఆగడాలను ఇకపై ఉపేక్షించబోమన్నారు. రోహిం గ్యా ముస్లింల సమస్యలపై స్పందించాలని యూఎస్ నిర్ణయించుకుందని అన్నారు. మయన్మార్ సైన్యం రోహింగ్యా ముస్లిం మహిళలపై లైంగికదాడులు, ఊచకోత కోస్తున్న సంగతి తెలిసిందే. మయన్మార్ బలగాలు సృష్టించిన నరమేధంలో వేలాది మంది అమాయక రోహింగ్యా ముస్లింలు మృతి చెందారు. ప్రాణ భయంతో లక్ష లాది మంది మయన్మార్ నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. అయితే, సరిహద్దు దాటుతున్న రోహింగ్యా ముస్లింలను మయన్మార్ సైన్యం లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నది. రోహింగ్యా ముస్లింపై జరుగుతున్న హత్యాకాండను నిలువరించలేకపోతున్నారని అంగ్సాన్ సూకీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐరాసవెల్లడించిన వివరాల ప్రకారం...ఈఏడాది ఆగస్టు నుంచి నవంబర్15 నాటికి 6లక్షల మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు.