Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: హిమనీనదాలు కరిగినట్టయితే ముంబయి నగరం కంటే కర్నాటక రాష్ట్రంలోని మంగళూరు నగరానికే అత్యంత ప్రమాదకరమని అమెరికాలోని నేషనల్ ఏయిరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) హెచ్చరించింది. కర్నాటకలోని సముద్ర మట్టం ముంబయి కంటే అధికంగా ఉన్నదని తెలిపింది. గ్రేడియంట్ ఫింగర్ప్రింట్ మ్యాపింగ్ పేరిట నాసా శాస్త్రవేత్తలు ఓ నివేదికను రూపొందించారు. దానిలోని వివరాల ప్రకారం...293 ఓడరేవు నగరాల్లో సముద్రపు నీటి మట్టం పెరుగుదల గురించి వివరించారు. భూపరిభ్రమణం, గురు త్వాకర్షణ శక్తి తదితర అంశాల గురించి నివేదికలో పేర్కొన్నారు. మంగళూరులో నీటి మట్టం 1.598 ఉండగా, ముంబయిలో సముద్ర మట్టం1.5 26ఎంఎం మాత్రమే ఉన్నదని తెలిపింది. వరదలు సంభవించినప్పుడు ఓడరేవు నగరాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు, శాస్త్రవేత్త ఎరిక్ ఐవిన్స్ తెలిపారు.