Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుల్లో భారత సంతతి వ్యక్తి
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో దుండగులు జరిపిన కాల్పుల్లో భారత విద్యార్థి మృతి చెందాడు. స్థానిక పోలీస్ అధికారి జై వార్నీ తెలిపిన వివరాల ప్రకారం... ఫ్రెన్సో సిటీలోని గ్యాస్ స్టేషన్కు సమీ పంలోని గ్రోసరీ షాపులో పనిచేస్తున్న ధరమ్ప్రీత్ సింగ్(21)పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. నిందితుల్లో ఒకరు భారత సంతతికి చెందిన వ్యక్తి ఉన్నాడని అన్నారు. ధరమ్ప్రీత్ షాపులో పనిచేస్తున్న సమయంలో నలుగురు దుండగులు చొరబడ్డారు. వారి వద్ద ఆయుధాలు ఉండటం గమనించిన ధరమ్ప్రీత్ క్యాష్ కౌంటర్ వెనుకకు వెళ్లి దాచుకున్నాడు. షాపులో అందినకాడికీ దోచుకున్న దుండగులు చివరికి క్యాష్ కౌంటర్లోని నగదును కూడా తస్కరించారు. క్యాష్ కౌంటర్ వెనక దాక్కున్న ధరమ్ప్రీత్ని గుర్తించిన దుండగులు కాల్చి చంపారు. రక్తపు మడుగులో పడివున్న ధరమ్ప్రీత్ను గమనించిన కస్టమర్లు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. అనుమానితుల్లో ఒకడైన భారత సంతతి వ్యక్తి అర్మిత్రాజ్ సింగ్ అత్వాల్ (22)ను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నారు. పంజాబ్కు చెందిన ధరమ్ప్రీత్ సింగ్ (21) మూడేండ్ల కిందట స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చాడు. గ్రోసరీ షాపులో పార్ట్టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నాడు. ధరమ్ప్రీత్ చాలా మంచి వ్యక్తి అని,అందరినీ చాలా ఆప్యా యంగా పలకరించేవాడని స్థానికులు చెబుతున్నారు.