Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరారే : జింబాబ్వేలో రాజకీయ సంక్షోభం కొనసాగు తోంది. గృహ నిర్బంధంలో ఉన్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే శుక్రవారం ప్రజలకు ముందుకొచ్చారు. జింబాబ్వే వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ముగాబేని నిర్బంధించిన ఆర్మీ జనరల్ భార్య మేరీ చివెంగా కూడా ముగాబే చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకోవడం గమనార్హం. జింబాబ్వే వర్సిటీ హాల్లోకి ముగాబే ప్రవేశించగానే ఆ కార్యక్రమానికి హాజరైన అతిథులు, ఇతరులు గౌరవసూచకంగా లేచి నిల్చున్నారు. అనంతరం అందరితో కలిసి ముగాబే జాతీయగీతం ఆలపించారు. అధ్యక్షుడి భద్రతా సిబ్బంది ఆయన వెంటే ఉన్నారు. గత మంగళవారం నుంచి ముగాబే గృహనిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే.Q