Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్రికాలోని మొరాకోలో ఘటన
రబాట్: ఆఫ్రికాలోని మొరాకోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సిది బౌలెమ్ గ్రామంలో ఓ స్వచ్చంధ సంస్థ ఆహారాన్ని పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు. స్వచ్చంధ సంస్థ ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని అధికా రులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. మొరాకోలో కరువు కారణంగా అక్కడి వారికి పంట లు పండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. దీంతో నిత్యావసర ధరలు, ఆహార పదార్థాలు ధర విపరీతంగా పెరిగిపోవడంతో స్థాని కులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఆహారం అందించేందుకు ఓ స్వచ్చంధ సంస్థ ముందుకు వచ్చింది. దీంతో ఆహారం కోసం అందరూ ఒక్కసారిగా తోసుకునే సరికి తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు.