Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు పోలీసులు మృతి, 8మందికి గాయాలు
కాబుల్: అఫ్ఘనిస్థాన్లోని పోలీసుల తనిఖీ కేంద్రాలపై తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ అధికార ప్రతినిధి బషీర్ ఫరాV్ా తెలిపిన వివరాల ప్రకారం...కుంద్ ఫ్రావిన్స్లోని పోలీస్ తనిఖీ కేంద్రాలపై తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు తాలిబన్లు చనిపోయారు. ఘటనాస్థలం నుంచి పరారైన తాలిబన్ల కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా,అఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారు. భద్రతా బలగాలు, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు.ఈనెల 14న కాందహార్లోని 12 చెక్పోస్ట్లపై తాలిబన్లు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 22 మంది పోలీసులు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.