Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన జింబాబ్వే అధ్యక్షుడి మూడున్నర దశాబ్దాల పాలన
- నంగాగ్వాకు అధికార పగ్గాలు అప్పగించే అవకాశం
హరారే: జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేకు ఘోర పరాభవం ఎదురైంది. ఇప్పటికే ఆయన అధ్యక్ష స్థానాన్ని కోల్పోగా తాజాగా అధికార జెడ్ఏఎన్యూ -పీఎఫ్ పార్టీ నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నది. దీంతో, 37 ఏండ్ల ఆయన పాలన మిలిటరీ సాయంతో శాంతి యుతంగా ముగిసింది. ఈనెలలో డిప్యూటీ పదవి నుంచి తొలగింపునకు గురైన ఎమెర్సన్ నంగాగ్వా అధ్యక్షుడు ముగాబే స్థానాన్ని అధిష్టిస్తారని జెడ్ఏఎన ్యూ-పీఎఫ్ పార్టీ ప్రకటించింది.ఆదివారం నిర్వ హించిన పార్టీ సమావేశం అనంతరం ముగాబేను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇక నుం చి నంగాగ్వానే తమ నేత అని తెలిపింది. కాగా, ముగాబే తర్వాత ఆయన సతీమణి గ్రేస్ కూడా అధ్యక్ష పదవి చేపట్టాలని భావించారు. ఈ విషయం తెలిసిన జింబాబ్వే సైన్యం రంగంలోకి దిగింది. అధికార పార్టీకి చెందిన కొంద రు కీలక నేతల సహకారంతో ముగాబేను గృహనిర్బంధంలో ఉంచింది. ఈసందర్భంగా పార్టీ నేత క్రిస్ మాట్లాడుతూ.. 93ఏండ్ల ము గాబే గౌరవ ప్రదంగా తప్పుకునేందుకు చర్చలు జరపడానికి ప్రయత్నించామని అన్నారు. ఆయన కావాలనుకుంటే దేశం విడిచి వెళ్లిపోవచ్చని అన్నారు. ముగాబే సతీమణి గ్రేస్తో పాటు ముగాబే కీలక మద్దతు దారులను పార్టీ నుంచి తొలగించామ న్నారు. కాగా, దేశ అధ్యక్ష పదవి నుంచి కూడా ముగాబేను తప్పుకోవాల్సిందిగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఒత్తిడి తీసుకొచ్చినా ఆయన నిరాకరించారు. గత మంగళవారం నుంచి ముగాబే గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే.
బ్రిటన్ నుంచి స్వాతం త్య్రం పొందినప్పటి నుంచి జింబాబ్వే అధ్యక్షుడిగా ముగాబేనే కొనసాగుతున్నారు. 93 ఏండ్ల వయసున్న ముగాబే తన రాజకీయ వారసురాలిగా భార్యను తెర పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. దీంతో అధ్య క్షుడి వైఖరి నచ్చని సైన్యం ఆయన్ని గృహనిర్బం ధంలో ఉంచింది. ముగాబే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని వేలాది మంది శనివారం హరారేలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.