Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్యాంగ్యాంగ్ : ఇదివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రక్కు నడుపుతున్నట్టు ఫోజులిస్తూ ఫొటోలు దిగడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అచ్చం ట్రంప్లాగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా ఇలాగే ట్రక్కు ఎక్కి ఫొటోలు దిగడం అందర్నీ ఆకట్టుకుంది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న దేశంగా ఉ.కొరియాపై ట్రంప్ సోమవారం ముద్ర వేసిన నేపథ్యంలో కిమ్ దిగిన ఫొటోలు బయటికి రావడం గమనార్హం. ఉ.కొరియా రాజధాని దక్షిణ ప్యాంగ్యాంగ్ ప్రావిన్స్లోని సుంగ్రి మోటర్ కాంప్లెక్స్ను కిమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగానే ఆయన ట్రంప్లా ట్రక్కులో ఎక్కి ఫొటోలకు పోజులిచ్చారు. మరోపక్క కిమ్ అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా ఆ దేశం ఎలాంటి క్షిపణి ప్రయోగాలకూ పాల్పడటం లేదని వార్తలు వెలువడ్డాయి. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, అవన్నీ పుకార్లు మాత్రమేనని ఈ ఫోటోలను బట్టి తెలుస్తున్నది.