Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియాద్ : సౌదీ అరేబియా దేశంలో వరదలు పోటెత్తాయి. దీంతో, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలు స్తంభిం చాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. వరద ఉధృతిని తట్టుకోలేక ప్రజలు వాహనాలపై, భవనాలపై ఎక్కి నిల్చున్న దృశ్యాలను నెటిజన్లు సామాజిక మీడియాల్లో పోస్ట్ చేశారు. ప్రధానంగా జెద్దా నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2009లో సౌదీలో భారీ వర్షాలు కురిసాయి. వరదల్లో చిక్కుకుని 123 మంది మృతి చెందారు.