Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ముంబయి పేలుళ్ల కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ను విడుదల చేయడంపై భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సయీద్ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడం తీవ్ర దిగ్రాÄ్భంతి ఆగ్రహం కలిగించాయని పేర్కొంది. ఈచర్యతో పాకిస్థాన్ నిజస్వరూపం మరోసారి బట్టబయలైందని పేర్కొంది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిథి రవీష్కుమార్ మాట్లాడుతూ 2008 నవంబరు,26న ముంబయిలో జరిగిన ఉగ్రదాడులకు హఫీజ్ సయీద్ సూత్రధారి మాత్రమే కాదని, ఈ దాడుల ప్రధాన నిర్వాహకుడు అతనేనని తెలిపారు. ఈ దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్కు శ్రద్ధ లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రభుత్వేతర శక్తులకు మద్దతిస్తూ, వారికి రక్షణ కల్పించే పాకిస్థాన్ విధానం మారలేదని అన్నారు. ఐరాస ప్రకటిత ఉగ్రవాది, స్వయంగా నేరాన్ని అంగీకరించిన హఫీజ్ సయీద్ను స్వేచ్ఛగా వదిలిపెట్టేందుకు పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంతో భారతదేశమే కాకుండా యావత్తు అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురైందని అన్నారు.