Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 35 మందికి గాయాలు
జకార్తా : ఇండోనేషియా లో తుఫాను బీభత్సం సృషి స్తున్నది. వరదల్లో చిక్కుకుని 35 మంది గాయపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. ప్రత్యేక సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. భారీగా ఆస్తినష్టం జరిగింది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. గంటకు 70కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈదురు గాలుల కారణంగా సిదోర్జో ప్రాంతంలోని ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈఏడాది ఫిబ్రవరిలో సిదోర్జో ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టించగా భారీ ఆస్తినష్టం జరిగింది.
బ్రిటన్లో వరదలు : బ్రిటన్లో వరద బీభత్సం కొనసాగుతున్నది. వరదల్లో చిక్కుకున్న 70మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయని అన్నారు. ఆస్తినష్టం జరిగింద న్నారు. విద్యుత్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపో కలు స్తంభిం చాయి. తుఫాను హెచ్చరికలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.