Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్తీరియా వ్యాధి బారినపడి 14 మంది మృతి డబ్యుహెచ్వో ఆందోళన
సనా : యెమెన్లో కలరా, డిప్తీరియా ( కంఠసర్తి వ్యాధి) వంటి అంటు వ్యాధులు విజృభిస్తున్నాయి. యుద్ధ వాతావరణం కొనసాగతుండటంతో ఇక్కడి ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సౌదీ సంకీర్ణదళాల దాడుల్లో వందలాది ఆస్పత్రులు, విద్యా సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయి. తాజాగా, యెమెన్లో డిప్తీరియా వ్యాధి అతి వేగంగా వ్యాపించడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ వ్యాధి బారినపడి 14మంది మృతి చెందారు. 100 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యుద్ధ వాతావరణం కారణంగా ప్రజలకు వైద్య సేవలు అందించలేకపోతున్నామని, ఇతర ప్రాంతాల నుంచి మందులు దిగుమతి చేసు కోలేకపోతున్నామని వైద్యులు తెలిపారు. యెమెన్లో డిప్తీరియా వ్యాధి విజృభి ంచడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యుహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది.