Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హూస్టన్ : షెరీన్ మాథ్యూస్ హత్య కేసులో దత్తత తండ్రి వెస్లే(37)పై కోర్టు హత్యారోపణలు నమోదుచేసింది. భారత్కు చెందిన 3 ఏండ్ల షెరీన్ మాథ్యూస్ చిన్నారిని ఏడాదిన్నర క్రితం వెస్లే దంపతులు దత్తత తీసుకున్నారు. అక్టోబర్ 6న వీరిద్దరూ డల్లాస్లోని తమ స్వగృహంలో చిన్నారి షెరీన్ను ఒంటరిగా వదిలి వెస్లే దంపతులు ఫంక్షన్కు వెళ్లినట్టు తెలిసింది. తిరిగొచ్చాక తెల్లవారుజామున 3 గంటలకు పాలు తాగమని చెప్పగా, చిన్నారి కనిపించకుండా పోయిందని వెస్లే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్టోబరు 7న ఇంటికి కొంతదూరంలో షెరీన్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఈ నేపథ్యంలో ఘటనపై దత్తత తీసుకున్న వెస్లే దంపతులపై అనుమానాలు వ్యక్తం అయ్యియి. శవపరీక్ష నివేదిక కూడా ఆ అనుమానాల్ని బలపర్చిందని, ఇది నరహత్య అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయని డల్లాస్ కౌంటీ జిల్లా అటార్నీ ఫెయిత్ జాన్సన్ విలేకర్ల సమావేశంలో చెప్పారు. చిన్నారిని ఒంటరిగా వదిలేయటం, సాక్ష్యాల్ని తారుమారు చేయటం, హత్య...తదతర ఆరోపణలు దత్తత తండ్రి వెస్లేపై నమోదుచేశామని ఆయన తెలియజేశారు. వెస్లే దంపతులు ఇద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఒకవేళ హత్యారోపణ రుజువైతే మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశముంది.