Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్
న్యూయార్క్ : భద్రతామండలిని మరింత ప్రజాస్వామ్యయుతం మార్చాల్సిన అవసర ముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెర్రస్ అన్నారు. సంస్కరణ లు ప్రవేశపెట్టి, భద్రతా మండలిలో అధికార సమతుల్యత సాధించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. శుక్రవారం ఇక్కడ జరిగిన 'జీ-77' దేశాల కూటమి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ''ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల్ని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించాలి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి సమితి వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం దక్కాలి. ఐరాస అధికారం భిన్న త్వంతో, సమతుల్యంతో కూడినదిగా ఉండాలి. భద్రతామండలిలో సంస్క రణలు చేపట్టి, సర్వప్రతినిధి సభను మళ్లీ పున:ప్రారంభించాలి. దీనిని నేను బలంగా కోరుకుంటున్నాను'' అని చెప్పారు. తాము తెరమీదకు తెస్తున్న ఈ ప్రతిపాదనను జీ-77 కూటమి బలపరుస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తద్వారా న్యాయాన్ని సులభంగా పునరుద్ధరించ వచ్చునని చెప్పారు. ఇందుకుగాను జీ-77 కూటమి పోషించే పాత్రచాలా ముఖ్యమైనదని అన్నారు. భిన్నదేశాలతో ఏర్పాటైన ఈ కూటమిద్వారా ప్రపంచ సంబంధాలు మరింత న్యాయాన్ని అందించే విధంగా చెప్పారు.