Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీసులో నిరసించిన కార్మిక లోకం
- సంస్కరణల బిల్లుకు వ్యతిరేకత
ఏథెన్స్ : సమ్మె చేసే హక్కుపై ఆంక్షలు విధించడంతో సహా కొత్తగా తీసుకువస్తున్న సంస్కరణలను వ్యతిరేకిస్తూ సెంట్రల్ ఏథెన్స్లో శుక్రవారం వేలాదిమంది నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. బెయిలవుట్ నిధులు తీసుకున్నందుకు బదులుగా పార్ల మెంట్ వచ్చే వారం ఈ సంస్కరణల బిల్లును ఆమోదించాల్సి వుంది. కొత్త సంవత్సరంలో తలెత్తిన ఈ మొట్టమొదటి పారిశ్రామిక తిరుగుబాటు సందర్భంగా ఏథెన్స్ మెట్రోను మూసివేశారు. రోజూ దాదాపు పది లక్షలమంది ప్రజలు ఉపయోగించే ఈ మెట్రోను నిలిపివేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నావికులు కూడా సమ్మెలో వుండడంతో సముద్రంలో నౌకలు కూడా తిరగలేదు. డాక్టర్లు సమ్మెకు దిగడంతో రిజర్వ్ సిబ్బందితో ఆస్పత్రులు నడిచాయి. సోమవారం ఈ బిల్లును గ్రీసు పార్లమెంట్ ఆమోదించాల్సి వుంది.