Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెడ్డా : పురుషుల ఫుట్బాల్ క్రీడ తిలకించడానికి మొట్టమొదటి సారిగా సౌదీ అరేబియాలోని మహిళలను అనుమతించారు. దీంతో నలుపు రంగు వస్త్రధారణ, ఫ్లోరెసెంట్ నారింజ దుస్తులు ధరించిన మహిళలు శనివారం రాజు అబ్దుల్లా స్టేడియంలోని గేట్లు వద్ద నిలబడి మ్యాచ్ను వీక్షించారు. అల్-అహ్లీ, అల్-బాటిన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ పోటీలకు మహిళలు వారి భర్తలతో, పిల్లలతో, మిత్రులతో కలిసి వీక్షించారు. జెడ్డాలోని డమ్మామ్, రియాద్ స్టేడియాలను 2018 లో ప్రారంభించి కుటుంబాలను ఆహ్వానిస్తామని గత అక్టోబర్లోనే జనరల్ స్పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం చాలా కాలం క్రితమే జరిగిఉండాల్సిందని ఈ క్రీడకు హాజరైన వారిలో ఒకరు పేర్కొన్నారు.
బహిరంగ క్రీడా కార్యక్రమంలో మహిళలు పాల్గొనడానికి అనుమతించే నిర్ణయంతో దేశంలో మంచి మార్పును తెస్తుందని ఆశిస్తున్నారు.. కొన్ని నెలల క్రితం మహిళలు కారు నడిపే హక్కును సౌదీ అరేబియా ప్రకటించిన అనంతరం గురువారం వారి కోసం మొట్టమొదటి కారు ప్రదర్శన ఏర్పాటు చేశారు.